తెలుగు ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ అంటే చెప్పాల్సిన పనిలేదు.. జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెర పైన హాట్ యాంకర్ గా పేరు సంపాదించింది అనసూయ.. గ్లామర్ వోలకబోయడంతో అనసూయ తర్వాతే ఎవరైనా అని కూడా చెప్పవచ్చు. యాంకరింగ్ లో ఒక ట్రెండ్ ని సెట్ చేసింది. జబర్దస్త్ షో వల్ల అనసూయ ఫేక్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలలో కీలకమైన పాత్రలలో కూడా నటిస్తోంది.పలు సినిమాలలో విలన్ గా కూడా నటించింది అనసూయ. ఇలాంటి సమయంలో అనుకోకుండా బుల్లితెరకు దూరమయ్యింది.. యాంకర్ గా దూరమైన అనసూయ వెండితెర పైన మాత్రం అలరిస్తూ ఉంటుంది.


ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జబర్దస్త్ మానేయడానికి గల కారణాలను సైతం వెల్లడించింది.. గతంలో ఈ విషయాన్ని కాస్త సస్పెన్స్ గా ఉంచినప్పటికీ ఇటీవల ఈ విషయం పైన యాంకర్ అడగగా ఓపెన్ గా చెప్పేసేసింది. జబర్దస్త్ వీడడం వేనుక రీజన్ ని తెలుపుతూ.. తనని జబర్దస్త్ నుంచి ఎవరు తీసేయలేదని తానే మానేశానని తెలియజేసింది. ఆ సమయంలో తాను ఒకేసారి మూడు తెలుగు సినిమాలు మూడు తమిళ సినిమాలలో నటిస్తూ ఉన్నానని..


తన షెడ్యూల్ కారణంగా చాలామంది కమెడియన్స్ ఇబ్బంది పడ్డారని తన వల్ల ఈవెంట్స్ కూడా డిస్టర్బ్ కాకూడదని ఉద్దేశంతోనే తాను జబర్దస్త్ ను వదిలేసాను అని తెలిపింది అనసూయ.. మల్లెమాల సంస్థతో తనకి ఇప్పటికి మంచి రిలేషన్ ఉందని ఇప్పటికీ కొన్ని ప్రపోజ్  వస్తున్నప్పటికీ సినిమాలను బిజీ కావడం వల్ల తాను వాటిని దూరం పెడుతున్నానని తెలిపింది.. 2013లో జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. రోజా నాగబాబు జడ్జిలుగా వ్యవహరించి దాదాపుగా వీరు ముగ్గురు పదేళ్లపాటు కొనసాగారు.. 2022లో అనసూయ యాంకర్ కి గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. ఎట్టకేలకు అనసూయ ఇన్ని రోజులకు జబర్దస్త్ మానేయడానికి కారణం చెప్పడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: