ప్రముఖ ఎలెక్ట్రానిక్ మొబైల్ కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు ఎలెక్ట్రానిక్ వస్తువులను తయారు చేసే ఆలోచనలో ఉన్నారు.అలానే టీవీ లను తయారు చేసి మార్కెట్లో వదులుతున్నారు. తాజాగా ఒప్పో కంపెనీ కూడా తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్ టీవీ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అతి పెద్ద స్క్రీన్ టీవీ తక్కువ ధరకే మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఆ టీవీ పూర్తి వివరాలను ఓ సారి చూసేద్దాం. 


వివరాలు ఇవే.. ఒప్పో స్మార్ట్ టీవీ కే9 సిరీస్ చైనా లో లాంచ్ అయింది. 43 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల సైజుల్లో ఈ టీవీలు లాంచ్ అయ్యాయి. వీటిలో ఎల్సీడీ ప్యానెళ్లు అందించారు. 43 అంగుళాల మోడల్‌లో ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే ఉండగా, 55 అంగుళాలు, 65 అంగుళాల వేరియంట్లలో 4కే రిజల్యూషన్ అందుబాటు లో ఉంది. దీంతోపాటు వీటిలో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, లో బ్లూలైట్ మోడ్ కూడా ఉన్నాయి..43 అంగుళాల వేరియంట్ ధరను రూ.22,800 నిర్ణయించారు. 55 అంగుళాల వేరియంట్ ధర.. రూ.32,000 ఉండగా, 65 అంగుళాల వేరియంట్ ధర రూ.45,600 ఉంది. 


అయితే, ఈ మూడు ఫోన్లను ప్రారంభ ఆఫర్ కింద తక్కువ ధరకే ఒప్పో అందిస్తోంది. దీంతో 43 అంగుళాల వేరియంట్‌ను రూ.20,500, 55 అంగుళాల వేరియంట్ ‌ను రూ.22,800, 65 అంగుళాల వేరియంట్ ‌ను రూ.37,700 కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే అందుబాటు లో ఉండనుంది. కలర్ఓఎస్ టీవీ2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీలు పనిచేయనున్నాయి. రిమోట్‌లో వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉండనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, డీటీఎంబీ పోర్టు, ఎథర్‌నెట్ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి



మరింత సమాచారం తెలుసుకోండి: