ఇక ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌లు అనేవి చాలా అధికమవ్వడంతో డెలివరీ బాయ్‌లు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయారు. చాలా మంది యువత కూడా పార్ట్‌టైం జాబ్‌ కింద డెలివరీబాయ్‌లా పనిచేస్తూ తమ ఆదాయాన్ని సృష్టించుకుంటున్నారు.ఇక సమయానికి ఫుడ్‌ డెలివరీ చేయాలంటే వారు ఎన్నో రకాల సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎండలు, వానలు ఇంకా ట్రాఫిక్‌ వంటి ఆటంకాలను దాటుకొని కస్టమర్లకు వారు ఆర్డర్‌ అందించాల్సిందే. తాజాగా వీల్‌చైర్‌లో కూర్చొని ఫుడ్‌ డెలివరీ చేస్తున్న ఓ దివ్యాంగుడి వీడియో అయితే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ తెగ వైరల్‌గా మారింది. ఆ సదరు వ్యక్తి కృష్టి ఇంకా అలాగే అతని పట్టుదల పట్ల నెటిజన్లు బాగా ఫిదా అయ్యి ఎన్నో రకాల ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక చెన్నైకు చెందిన 37 ఏళ్ల గణేష్‌ మురుగన్‌ జొమాటోలో ఫుడ్‌ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. గణేష్‌ ఒక దివ్యాంగుడు. వీల్‌చైర్‌లో కూర్చొని తన ఆర్డర్‌లు డెలివరీ చేస్తుంటాడు. దేశంలోనే తొలి వీల్‌చైర్‌ డెలివరీబాయ్‌గా అతను రికార్డు సృష్టించాడు. ఇక నడవలేని స్థితిలో ఉన్న గణేష్‌.. వీల్‌చైర్‌లో కూర్చొని ఆర్డర్‌లు అందిస్తున్న వీడియోను గ్రూమింగ్‌ బుల్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేయడం జరిగింది. 


గత నాలుగు రోజులుగా ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది. ఇక వీటిని రీపోస్టు చేస్తూ 'గొప్ప స్ఫూర్తికి నిజమైన ఉదాహరణ' అంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. ఆయన ధైర్యాన్ని ఇంకా సంకల్ప శక్తిని ఎంతగానో కొనియాడుతున్నారు. అంతేగాక గణేష్‌కుకి ఉపాధి కల్పించినందుకు జోమాటోను కూడా వారు ప్రశంసించారు.ఓ ఆరేళ్ల క్రితం ప్రమాదంలో వెన్నెముకకు గాయం కావడంతో మురుగన్‌ వీల్‌చైర్‌కే పరిమితమయ్యాడు. అయితే ఆదే అతన్ని సంకల్ప దైర్యాన్ని బాగా రెట్టింపు చేసింది. మురుగన్ లైఫ్‌ స్టోరీని జూన్‌లో ఛత్తీస్‌గఢ్ ఐపీఎస్‌ అధికారి దీపాంషు కబ్రా మొదటిసారి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.కష్టాలపై పోరాడటం మానేసి చేతులెత్తేసే వారందరికీ కూడా ఇది స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఇక ఈ మురుగన్ వీల్ చైర్‌ను మద్రాస్‌లోని ఐఐటీ స్టార్టప్ రూపొందించింది.ఇంకా దీనిని నాలుగు గంటలు పూర్తిగా ఛార్జ్ చేస్తే..మొత్తం 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: