మొదటగా విద్యార్థి చేయవలసిన పని, ఏ సబ్జెక్టు నైనా కూడా కష్టపడి చదవకూడదు. ఇష్టపడి చదివితేనే ఆ సబ్జెక్టు మీకు బాగా అర్థమవుతుంది. అందులోనే అంశాలు దీర్ఘకాలం మీకు గుర్తు ఉంటాయి.
* ఒకసారి చదివేశాను ఇప్పటికి బాగా వచ్చేసింది అని ఈజీ గా తీసుకోకూడదు. సాధన అనేది చాలా అవసరం. అప్పుడప్పుడు చదువుకున్న అంశాలను తిరిగి మళ్లీ ఒకసారి రివైండ్ చేసుకుంటూ ఉండాలి.
* సమాధానాలను బట్టి పట్టకుండా, అర్థం చేసుకొని సొంతంగా రాయడానికి ప్రయత్నించాలి. ఈ క్రమంలో రియాలిటీని విస్మరించకూడదు. అంటే చదివిన విశ్లేషణలకు అర్థం మారకుండా చూసుకోవాలి. సొంతంగా రాస్తున్నాం కదా అని ఎలా పడితే అలా రాయకూడదు.
* పరీక్షల కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. అందుకోసం మెయిన్ పరీక్షల కన్నా ముందే ప్రాక్టీస్ కోసం ప్రశ్నపత్రాన్ని తయారుచేసుకుని ఆ ప్రశ్నలకు మీరు చదివింది గుర్తు చేసుకొని ఎంతవరకు సమాధానం ఇవ్వగలుగుతారు అన్నది చెక్ చేసుకోవాలి.
* ఇలా రెండు మూడు సార్లు చేయడం వల్ల పరీక్షలు అంటే కంగారు పోవడమే కాదు, అభ్యసనం పెరిగి సబ్జెక్టును బాగా గుర్తు పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది.
* ఒకవేళ పరీక్షలు అనగానే ఎంతగా సర్దిచెప్పుకుంటున్నప్పటికీ మీలో టెన్షన్ మొదలైనట్లు అయితే, మీ గురువులకు గాని తల్లిదండ్రులకు గాని మీ సమస్యను చెప్పి వారి సలహాలను సూచనలను తీసుకోవాలి.
* వీలైనంతవరకూ మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకుంటూ ముందుకు సాగాలి.
* పరీక్షల్లో ప్రతి ఒక్క విద్యార్థికి మంచి మార్కులు రావడం కష్టం, తక్కువ మార్కులు వస్తున్నాయి కదా అని మిమ్మల్ని మీరు విమర్శించకోకుండా, తదుపరి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నించండి.
* అందరి విద్యార్థుల జ్ఞానం ఒకేలా ఉండదు. కాబట్టి అందరికీ గొప్ప ర్యాంకులు రాకపోవచ్చు, కానీ మీకు వీలైనంత వరకు ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి.
* నేటి తరంలో చదువు అన్నది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరడానికి ఎన్నో మార్గాలు ఉన్నా విద్యకు ఉన్న ప్రాముఖ్యత మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరదు.