ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉండటంతో గర్భిణులల కోసం అమెరికా వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. కరోనా సమయంలో హెల్త్ చెకప్స్‌ కోసం వెళ్లే సమయంలో వీళ్లు కూడా అందరిలాగే చేతులు శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక మిగతా వారితో పోలిస్తే, గర్భిణులకు వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువగా లేవు. అయినప్పటికీ గర్భధారణ వల్ల వారి శరీరంలో, రోగ నిరోధక వ్యవస్థలో వచ్చే మార్పుల కారణంగా వారి శ్వాసకోశ వ్యవస్థ ఇన్‌ ఫెక్షన్లకు తేలికగా గురయ్యే వీలు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకారం తెలుపుతుంది.

అయితే ఇప్పటి వరకు కరోనా ఇన్‌ ఫెక్షన్‌ ఫలితంగా గర్భస్రావం జరిగినట్టు, గర్భిణి నుంచి గర్భస్థ శిశువుకు వైరస్‌ సోకినట్టు ఆధారాలు లేవని అన్నారు. ఇక మార్చి నెలలో లండన్‌ లో ఓ పసికందుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ గా ఫలితం వచ్చింది. ఇక ఈ ఇన్‌ఫెక్షన్‌ గర్భంలో ఉన్నప్పుడే శిశువుకు సోకిందా లేక ప్రసవ సమయంలో సోకిందా అనే విషయంలో స్పష్టత రాలేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక ఇప్పటివరకూ ఈ వైరస్‌తో తీవ్ర అనారోగ్యానికి లోనైన పసికందుల కేసులు లేకపోయినప్పటికీ, 12 నెలల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకితే, వారికి రిస్క్‌ ఎక్కువే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక ‘కొవిడ్‌ - 19’ కారక వైరస్‌ తల్లి పాలలో ఉన్న ఆధారాలు ఇప్పటివరకూ లేవని అన్నారు. అయితే కరోనా లక్షణాలు ఉన్న తల్లులు బిడ్డకు పాలిచ్చే సమయంలో ముఖానికి మాస్క్‌ ధరించడం లాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అయితే కరోనా సోకినంత మాత్రాన తల్లులు బిడ్డకు పాలివ్వకూడదని నిపుణులు అనడం లేదని అంటున్నారు. ఇక ఇందుకు కారణం తల్లి పాలల్లో వైరస్‌తో పోరాడడానికి తోడ్పడే యాంటీబాడీలు ఉండడమేనని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: