హీరో మోటార్ కార్ప్ నుండి కొత్త ఎక్స్ ట్రీం 200ఆర్ బైక్ రిలీజ్ కాబోతుంది. అయితే రిలీజ్ కు ముందే ఈ బైక్ రేటు ఎలా ఉండబోతుందో హీరో అఫిషియల్ వెబ్ సైట్ లో ఉంచింది. హీరో నుండి రాబోతున్న ఈ సరికొత్త ఎక్స్ ట్రీం 200ఆర్ బైక్ ధర 88,000 రూ..గా నిర్ణయించారు. 


200సిసి కెపాసిటీ ఇంజిన్ తో ఈ ధరతో కేవలం హీరో మాత్రమే ఇలాంటి బైక్ ఇస్తుందని చెప్పొచ్చు. అయితే హీరో 200ఆర్ ఎక్స్ ట్రీం బైక్ తో టివిఎస్ అపాచీ 200 4వి, బజాజ్ పల్సర్ ఎన్.ఎస్ 200వంటి బైకులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. టివిఎస్, బజాజ్ 200సిసి బైకులు లక్షకు పైగా ధరతో లభిస్తున్నారు. 


మరి ఆ లెక్కతో పోల్చుకుంటే కచ్చితంగా హీరో ఎక్స్ ట్రీం తక్కువ ప్రైజ్ లోనె 200ఆర్ ను రిలీజ్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక దీని స్పెషిఫికేషన్స్ విషయానికొస్తే 5 స్పీడ్ ట్రాస్ మిషన్స్ గల ఈ బైక్ 18.1 బి.హెచ్.పి పవర్ ఇంకా 17.2 ఎన్.ఎం టార్క్ తో అందుబాటులో ఉంటుంది. 39.9 కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ తో ఈ బైక్ వస్తుంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: