హై స్పీడ్ స్కూటర్ ని కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. జాయ్ ఈ- బైక్ కంపెనీ తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మిహోస్‌ను ఇండియన్ మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు 2023 ఆటో ఎక్స్‌పోలో ఈ స్కూటర్ ని ప్రదర్శించింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వడోదరలోని వార్డ్‌విజార్డ్ R&D టీం డిజైన్ చేసి అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇంకా ఈ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలింగ్ పరంగా మంచి రెట్రో డిజైన్‌ను కలిగి ఉంది. దీనిలో ముందువైపు రౌండ్ హెడ్‌లైట్, సర్క్యూలర్ షేప్ లో వెనుక అద్దాలు, ఆప్రాన్-మౌంటెడ్ ఫ్రంట్ టర్న్ ఇండికేటర్‌లు , కర్వీ బాడీ ప్యానెల్‌లు ఉన్నాయి.అలాగే ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లపై, అలాగే వెనుక వైపు మోనో-రివర్సిబుల్ స్ప్రింగ్ సస్పెన్షన్‌ అనేది ఉంది. ఇంకా అలాగే సైడ్ స్టాండ్ సెన్సార్,హైడ్రాలిక్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS) వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, బ్యాటరీకి రిమోట్ యాక్సెస్, రివర్స్ మోడ్, GPS, యాంటీ-థెఫ్ట్ ఫీచర్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి అప్డేటెడ్ ఫీచర్లు ఉన్నాయి.


ఈ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 1500W ఎలక్ట్రిక్ మోటార్ తో వస్తుంది. ఈ స్కూటర్ 95Nm టార్క్ అవుట్‌పుట్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఈ స్కూటర్ ఏడు సెకన్లలోపే 0-40కిమీల వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. అలాగే మాక్సిమం స్పీడ్ గంటకు 70 కి.మీ. ఈ స్కూటర్ కి నికెల్ మాంగనీస్ కోబాల్ట్ కెమిస్ట్రీతో 74V40Ah లియాన్  బ్యాటరీని ఉంటుంది. ఇక దీన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ ని ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 100 కి.మీ. మైలేజీ వస్తుంది.ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం నాలుగు రంగులలో అందుబాటులో ఉంటుంది. అవి మెటాలిక్ బ్లూ, సాలిడ్ బ్లాక్ గ్లోసీ, సాలిడ్ ఎల్లో గ్లోసీ, పెర్ల్ వైట్. దీని ధర వచ్చేసి రూ. 1,49,000 ఎక్స్-షోరూమ్ (పాన్ ఇండియా) గా ఉంది. గుజరాత్‌ వడోదరలోని కంపెనీ తయారీ కేంద్రంలో దీనిని తయారు చేసి. దేశ వ్యాప్తంగా డెలివరీలు చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: