టీం ఇండియా సీనియర్ ఆటగాడు మనోజ్ తివారి కోల్‌కతా నైట్ రైడర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. కేకేఆర్ జట్టు తొలిసారి కప్ గెలిచి 8 ఏళ్ళు అయిన సందర్భంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో మన్వీందర్ బిస్లా, మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్‌, బ్రెండన్ మెక్‌కల్లమ్, సునీల్ నరైన్, బ్రెట్‌లీలను ట్యాగ్  చేసి తనను ట్యాగ్ చేయకపోవడంపై తివారి ఆగ్రహ౦ వ్యక్తం చేసాడు. 

 

ఆ సీజన్‌లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తనని, షకీబ్ అల్ హసన్‌ని ట్యాగ్ చేయకపోవడం అవమానకరమని ఆవేదన వ్యక్తం చేసాడు. అందరితో పాటు తనకు కూడా ఆ రోజుతో కొన్ని అనుభూతులు జ్ఞాపకాలు ఉన్నాయని పేర్కొన్నాడు. వెంటనే స్పందించిన కేకేఆర్ ఇద్దరినీ ట్యాగ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: