టీం ఇండియా సీనియర్ ఆటగాడు మనోజ్ తివారి కోల్కతా నైట్ రైడర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. కేకేఆర్ జట్టు తొలిసారి కప్ గెలిచి 8 ఏళ్ళు అయిన సందర్భంగా కోల్కతా నైట్రైడర్స్ జట్టు ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లో మన్వీందర్ బిస్లా, మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్, బ్రెండన్ మెక్కల్లమ్, సునీల్ నరైన్, బ్రెట్లీలను ట్యాగ్ చేసి తనను ట్యాగ్ చేయకపోవడంపై తివారి ఆగ్రహ౦ వ్యక్తం చేసాడు.
ఆ సీజన్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తనని, షకీబ్ అల్ హసన్ని ట్యాగ్ చేయకపోవడం అవమానకరమని ఆవేదన వ్యక్తం చేసాడు. అందరితో పాటు తనకు కూడా ఆ రోజుతో కొన్ని అనుభూతులు జ్ఞాపకాలు ఉన్నాయని పేర్కొన్నాడు. వెంటనే స్పందించిన కేకేఆర్ ఇద్దరినీ ట్యాగ్ చేసింది.
Yes I, along with others have too many memories, emotions and that will remain forever but after seeing this tweet where u all forgot to mention n tag me and @Sah75official is insulting and this mrng tweet of urs will remain close to every knight Rider’s 💓 #disappointed https://t.co/FF53pqP1pE
— MANOJ TIWARY (@tiwarymanoj) May 27, 2020