అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు వచ్చిన ముప్పు ఏమీ లేదని ఆయన ఫిజీషియన్ షాన్ కానలే మీడియా సమావేశంలో చెప్పారు. కరోనా సోకినా సమయానికి ఇప్పటికి ట్రంప్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందని అన్నారు. రెమీడేసీవార్ ఇప్పటి వరకు రెండు సార్లు ట్రంప్ కి ఇచ్చారని ఆయన మీడియాకు చెప్పారు. రేపు కూడా ఆయనకు మరోసారి డాక్టర్లు ఆ మందుని ఇస్తారని చెప్పారు.

రక్తంలో ఆక్సీజన్ లెవెల్స్ తగ్గినా సరే ఆ తర్వాత మళ్ళీ పెరిగాయని వివరించారు. ట్రంప్ చికిత్సకు చాలా బాగా స్పందిస్తున్నారని వివరించారు. కరోనా చికిత్స తీసుకుంటూనే ఆయన అధ్యక్షా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ట్రంప్ వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెడుతున్నారు. అందరి సహాయంతో నేను చాలా బాగున్నా అని ట్రంప్ పేర్కొన్నారు. వాల్టర్ రీడ్ మిలటరీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: