గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు తెరాస పార్టీ చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ మాత్రం ఓడిపోయినా సరే ఆ పార్టీకి అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. చివరి నిమిషంలో మూడు డివిజన్ల కు అభ్యర్థులను మార్చిన టిఆర్ఎస్... కొత్త వారికి ఇచ్చింది. మొదట జాబితాలో పేర్లు ప్రకటించిన వారికి కాకుండా ఇతరులకు బి ఫారాలు ఇచ్చింది.

ఘాన్సీబజార్ డివిజన్ లో మొదటి జాబితాలో ఇశిత పేరును టిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. చివరి క్షణంలో గోపి గౌడ్ కు బి ఫామ్ ఇచ్చింది. లంగర్ హౌస్ డివిజన్ లో మొదటి జాబితాలో పార్వతమ్మ యాదవ్ పేరును ప్రకటించిన పార్టీ...  చివరి క్షణంలో భాగ్యలక్ష్మి కి బి ఫామ్ ఇచ్చింది. అహ్మదనగర్ డివిజన్ లో మొదటి జాబితాలో సారిక పేరును ప్రకటించిన పార్టీ చివరి క్షణంలో ఎస్.మమత కు బి ఫామ్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: