చిత్తూరు జిల్లాలో పూతలపట్టు మండలం తుంబ వారి పల్లి లో వింత శబ్దాలు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయంతో పరుగులు తీసిన గ్రామస్తులు... అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. రాత్రంతా ఇళ్ల బయట జాగారం చేసారు ఆ గ్రామస్తులు. భూకంపం వచ్చిందంటూ ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం... తమను కాపాడాలని కోరారు. అది భూకంపం కాదని భూమి లోపల నుంచి వస్తున్న వింత శబ్దాలని అధికారులు గుర్తించారు.

గ్రామం రెండు ఎత్తున కొండల మధ్య ఉండడం, గతంలో వందల సంఖ్యలో  బోర్లు వేసి నీళ్లు పడకపోవడం ప్రస్తుతం భారీ వర్షాలకు ఆ బోర్లోకి నీరు చేరడం వంటి పరిణామాలతో వింత శబ్దాలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి తోడు భూమి లోపల కాళీ పొరలు ఏర్పడి ప్రస్తుతం వర్షపునీరు చేరడం తో వింత శబ్దాలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: