నిన్న రాత్రి బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించారు. ఈ పదవి కోసం బీజేపీ మొత్తం 20 పేర్లను పరిశీలించినట్టు తెలుస్తోంది. చివరకు దేశంలోని తూర్పు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న నిర్ణయం మేరకు ద్రౌపదీ ముర్మూను ఎంపిక చేశారు. ఇప్పటివరకూ రాష్ట్రపతి పదవి చేపట్టని ఎస్టీలకు ద్రౌపదీ ముర్మూ ఎంపిక ద్వారా ఆ గౌరవం కల్పించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు.
నిన్న రాత్రి బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించారు. ఈ పదవి కోసం బీజేపీ మొత్తం 20 పేర్లను పరిశీలించినట్టు తెలుస్తోంది. చివరకు దేశంలోని తూర్పు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న నిర్ణయం మేరకు ద్రౌపదీ ముర్మూను ఎంపిక చేశారు. ఇప్పటివరకూ రాష్ట్రపతి పదవి చేపట్టని ఎస్టీలకు ద్రౌపదీ ముర్మూ ఎంపిక ద్వారా ఆ గౌరవం కల్పించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు.