ఇప్పటి వరకు రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను విడిగా అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పుడు ఏకమొత్తంగా టవర్ల అమ్మకాన్ని చేపట్టింది. పోచారం, గాజులరామారం లోని ఇంకా మొత్తం పనులు పూర్తి కాని రాజీవ్ స్వగృహ టవర్ల విక్రయానికి నోటికేషన్ ఇచ్చింది. ఈ రెండు చోట్లా ఉన్న వాటిని టవర్ల వారీగా అమ్మేస్తారట.


పోచారంలో  నాలుగు, గాజులరామారంలో ఐదు టవర్లను అమ్మకానికి పెట్టింది. పోచారం లోని ఒక్కో టవర్లో 72 నుంచి 198 ఫ్లాట్లు ఉన్నాయి. గాజుల రామరంలోని ఒక్కో టవర్లో 112 ఫ్లాట్లు ఉన్నాయి. ఆసక్తి కలిగిన సంస్థలు, వ్యక్తులు టవర్ మొత్తం వ్యయంలో రెండు శాతం ఈఎండీ సమర్పించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈఎండీ సమర్పించేందుకు జనవరి 30 ఆఖరు తేదీ. లాటరీ ద్వారా టవర్లను కేటాయిస్తారు. www.hmda.gov.in , www.swagruha.telangana.gov.in వెబ్ సైట్ల లో టవర్ల వివరాలు, పూర్తి సమాచారం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: