కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ జరపాలని కోరుతూ డిజిపి అంజన్ కుమార్ కి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పూర్తి ఆధారాలతో ఏడు పేజీల లేఖను రాష్ట్ర డిజిపికి రేవంత్ రెడ్డి నివేదించారు. అధికార పార్టీ ప్రలాభాలకు గురిచేసి కాంగ్రెస్ పార్టీ నుంచి అక్రమంగా టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలపై గతంలో కూడా ఫిర్యాదు చేసినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆరో తేదీన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ 12 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మరొకసారి ఫిర్యాదు చేసినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

2014 నుంచి 2018 వరకు నలుగురు ఎంపీలు 25 మంది ఎమ్మెల్యేలు 18 మంది ఎమ్మెల్సీలను వివిధ పార్టీల నుంచి టిఆర్ఎస్ మీద చేర్చుకున్నట్లు రేవంత్ రెడ్డి  వివరించారు. 2018 ఎన్నికల తర్వాత మరొకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్నట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: