ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చాలా మంది మొటిమలు మచ్చలతో బాధ పడుతూ ఉంటారు. అలా బాధపడేవారు ఈ చిట్కాలను పాటించండి..బొప్పాయిని చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేయాలి. ఆ తర్వాత టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసి మిక్సీ ఆన్ చేసి పేస్ట్‌గా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకొని 10 నుంచి 15 నిమిషాలు ఆగాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ స్కిన్ టోన్ మెరుగుపరిచి ప్రకాశవంతంగా మారేలా చేస్తుంది. పైగా ముఖంపై ఉన్న మచ్చలను సైతం చర్మం రంగులో కలిసిపోయేలా చేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో పెరుగుకు సాటి వచ్చేది ఏదీ లేదు. అలాంటిది ఈ రెండూ కలిపి ఫేస్ మాస్క్‌గా అప్లై చేసుకొంటే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది.

ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కమలాఫలం రసంలో అర టేబుల్ స్పూన్ పసుపు పొడి కలపాలి. రాత్రి నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే ప్యాక్‌ను తొలిగించుకొని చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.కమలా ఫలం సిట్రస్ జాతికి చెందిన పండు. దీనిలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి పోషణను ఇచ్చి అందంగా మెరిసిపోయేలా చేస్తుంది. పైగా కమలాఫలం సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా మారిపోతుంది. కమలాఫలానికి పసుపు జోడించి ఫేస్ ప్యాక్ వేసుకొంటే చర్మం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్‌ను రాత్రి నిద్రపోయే ముందు అప్లై చేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఒక గిన్నెలో టీస్పూన్ శెనగపిండి, అరకప్పు పాలు, ఒక స్కూప్ తేనె తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ మాస్క్‌ను 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి.  ఈ సమయంలో దాన్ని తాకకూడదు. నిర్ణీత సమయం తర్వాత మైల్డ్ సోప్ ఉపయోగించి గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది.చర్మ గ్రంథుల నుంచి విడుదలయ్యే నూనెలను క్రమబద్ధీకరిస్తాయి.అంతేకాదు చర్మకణాలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. చర్మాన్ని హైడ్రేట్ చేసి సహజమైన మెరుపును అందిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: