దేశ వ్యాప్తంగా దేవాలయాల రీ ఓపెనింగ్ కి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపధ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం కి అనుమతులు వచ్చాయి. జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులను అనుమతిస్తుంది టీటీడీ. రేపటి నుంచి శ్రీవారి దర్శనాలు ప్రారంభంకానున్నాయని అధికారులు చెప్తున్నారు. రేపు, ఎల్లుండి టీటీడీ ఉద్యోగులతో ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. ఈనెల 10న స్థానికులకు శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించనున్నారు అధికారులు. 

 

ఇక ఇప్పటికే దేవాలయం మొత్తాన్ని కూడా అధికారులు శానిటేషన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇతర ప్రాంతాల వారికీ అనుమతి లేదు కాబట్టి కాస్త ఊపిరి పీల్చుకునే అంశం. అయితే కరోనా లక్షణాలు ఉన్న వారిని అనుమతించే అవకాశాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: