ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలను సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కార్ ని అభినంది౦చారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పదో తరగతి విద్యార్థులను రద్దు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

 

టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పక్షాన జనసేన చేసిన చేసిన విజ్ఞప్తిని గౌరవించి పరీక్షలను రద్దు చేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు ఆయన. వీటితో పాటు ఇంటర్మీడియట్ అడ్వాన్స్, సప్లమెంటరీ రద్దుచేసి ఉత్తీర్ణత ప్రటించడం సరైన నిర్ణయమని పేర్కొన్నారు పవన్. పరీక్ష రద్దు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: