భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ద వాతావరణం ఉన్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఆయన అనూహ్యంగా అక్కడి పర్యటనకు వెళ్ళడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఆయన వెళ్ళిన పర్యటనపై ఇప్పుడు చాలా మంది పెదవి విరుస్తున్నారు. దాడి జరిగింది గాల్వాన్ వ్యాలీ సమీపంలో... 

 

అయితే ఆయన అక్కడికి వెళ్ళకుండా కేవలం లడఖ్  దగ్గర గా ఉన్న  ప్రాంతానికి వెళ్ళారు. ఇక తన ప్రసంగంలో ఎక్కడా కూడా ఆయన చైనాపై నేరుగా విమర్శలు చేయలేదు. అసలు చైనా అనే మాట ఆయన నోటి నుంచి ఒక్క సందర్భంలో కూడా రాలేదు. దీనితో చాలా మంది షాక్ అయ్యారు. ఆయన చైనా విషయంలో దాగుడుమూతలు ఆడుతున్నారు అని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: