హిమాచల్ ​ప్రదేశ్​లో నిరుపయోగమైన శీతల భూభాగాల్లో ఇంగువ పంట పండించేందుకు 'ద ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ'(ఐహెచ్​బీటీ-సీఎస్ఐఆర్) నడుం కట్టింది. లాహాల్ ప్రాంతంలో రైతులతో కలిసి ఇంగువ సాగు చేపట్టింది. అక్టోబర్ 15న క్వారింగ్ గ్రామంలో సీఎస్​ఐఆర్-ఐహెచ్​బీటీ డైరెక్టర్ డా. సంజయ్ కుమార్ తొలి ఇంగువ విత్తనాన్ని నాటారని సెంటర్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రీయల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) తన ప్రకటనలో తెలిపింది.


ఐసీఏఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్(ఎన్​బీపీజీఆర్) ద్వారా ఇరాన్ నుంచి 2018 అక్టోబర్​లో ఈ విత్తనాలను దిగుమతి చేసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. దేశంలో ఇంగువ సాగు ప్రారంభించేందుకు గత 30 ఏళ్లలో చేసిన తొలి ప్రయత్నం ఇదేనని స్పష్టం చేసింది. సీఈహెచ్​ఏబీ, రిబ్లింగ్, లాహాల్, స్పిటి ప్రాంతాల్లో ఇంగువ మొక్కలను పెంచినట్లు పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: