రిజర్వ్
బ్యాంక్ ఆఫ్
ఇండియా (ఆర్బిఐ)
గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఉదయం 10 గంటలకు సెంట్రల్
బ్యాంక్ మానిటరీ కమిటీ (ఎంపిసి) విధానాలను ప్రకటించనున్నారు. అవేంటంటే రెపో రేటు మరియు రివర్స్ రెపో రేటు వరుసగా 4% మరియు 3.35% వద్దనే ఉంది. దానికి సంబంధించి వివరాలు ప్రకటించనున్నారు . ఇలా జరగటం ఇది వరుసగా ఆరోసారి. ఈ మేరకు
ఆర్బీఐ అధికారిక ట్విట్టర్ ఖాతా వెల్లడించింది. ఓ పోస్టును పెట్టింది. ఈ పోస్ట్ లో ఈరోజు ఉదయం 10 గంటలకు ఆర్బిఐ
గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన ప్రకటన చేస్తారు.మధ్యాహ్నం 12 గంటలకు పోస్ట్-పాలసీ విలేకరుల సమావేశం ప్రసారం చేయబడుతుంది.