తెలంగాణా సిఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం ఏమో గాని ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన రైతుల సమస్యలకు సంబంధించి ఢిల్లీ పర్యటనకు వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో ఏం మాట్లాడతారు అనేది ఆసక్తిగా మారిన అంశం. సీఎం‌ కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర బీజేపీ నేతలు కాస్త గట్టిగా ఆరా తీస్తున్నారు అని తెలుస్తుంది. ఢిల్లీ బీజేపీ నేతలకు ఫోన్లు చేసి కేసీఆర్ ఢిల్లీ పర్యటన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గత ఢిల్లీ పర్యటన సందర్భంగా కొంత ఇబ్బంది పడ్డామని చెప్తోన్న కాషాయపార్టీ నేతలు.. హుజురాబాద్ ఫలితం తర్వాత కేసీఆర్ ఢిల్లీ పర్యటనను పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సొంత పనుల‌ మీదనే కేసీఆర్ కుటుంబం ఢిల్లీ వెళ్ళిదని బిజెపి నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇక ఆరోగ్య అవసరాల కోసం వెళ్లరనే కామెంట్స్ కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts