చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్.ఆర్.పురం మండలంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు దాడి చేసారని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్.ఆర్.పురం మండల కార్యాలయం ముందు ఉన్న రాజశేఖర్రెడ్డి విగ్రహం చేతి భాగం, ముఖమును గుర్తు తెలియని దుండగులు పగులగొట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైఎస్ విగ్రహంపై దాడికి యత్నించిన వారికీ కఠిన శిక్ష వేయాలని.. వైసీపీ కార్యకర్తలు, నేతలు ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయనందారెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. పోలీసులు ఏమి చేస్తున్నారు అని నారాయణ స్వామి నిలదీసారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే.. తోలు తీస్తాం అని హెచ్చరించారు.
చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్.ఆర్.పురం మండలంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు దాడి చేసారని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్.ఆర్.పురం మండల కార్యాలయం ముందు ఉన్న రాజశేఖర్రెడ్డి విగ్రహం చేతి భాగం, ముఖమును గుర్తు తెలియని దుండగులు పగులగొట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైఎస్ విగ్రహంపై దాడికి యత్నించిన వారికీ కఠిన శిక్ష వేయాలని.. వైసీపీ కార్యకర్తలు, నేతలు ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయనందారెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. పోలీసులు ఏమి చేస్తున్నారు అని నారాయణ స్వామి నిలదీసారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే.. తోలు తీస్తాం అని హెచ్చరించారు.