తెలంగాణలో జోరుగా కురుస్తున్న వర్షాలు జల విలయం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా అనేక నీటి ప్రాజెక్టులు నిండిపోయాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని అనేక పంపు హౌసులు మునిగిపోయాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్‌ తీరును విమర్శించారు. కేసీఆర్.. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఇంజనీరింగ్ నైపుణ్యం ఇదేనా అంటూ ప్రశ్నించారు.


లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం పంప్ హౌజ్ ను నీటిపాల్జేస్తావా  అని బండి సంజయ్ ప్రశ్నించారు. వందల కోట్లతో నిర్మించిన సిరిసిల్ల, జనగాం కలెక్టరేట్లను ముంచుతావా?.. గొప్పగా చెప్పుకున్న యాదాద్రి నిర్మాణాలూ కుంగిపోవడం సిగ్గుచేటు.. మీ 8 ఏళ్ల పాలనలో పన్నులు పెంచడం... ప్రజలను ముంచడం తప్ప సాధించేదేమిటి?.. ఇకనైనా కోతలు బంద్ చేసి ప్రజల గోసను పట్టించుకోండి అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: