ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పలు ఎన్టీపీసీ ఇంధన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హరిత ఇంధన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.రూ.5,200 వేల కోట్ల హరిత ఇంధన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్, జాతీయ సోలార్ రూఫ్‌టాప్ పోర్టల్‌ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు.

ఉజ్వల్ భారత్- ఉజ్వల్ భవిష్యత్‌- పవర్ 2047 ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న  మోదీ... రామగుండం, కేరళలోని ప్రాజెక్టులు జాతికి అంకితం చేయనున్నారు. రామగుండంలోని వంద మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్టు జాతికి అంకితం చేయనున్నారు. కేరళలో 92మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టును కూడా  జాతికి అంకితం చేస్తారు. అలాగే.. రాజస్థాన్‌లో 735మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు, లేహ్‌లోని గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్టుకు, గుజరాత్‌లోని కవాస్ గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ విత్ నేచురల్ గ్యాస్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: