హైదరాబాద్ శివార్లలో.. లాలాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వారం రోజులపాటీ కన్హా శాంతి వనంలో మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఇందులో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే సుమారు లక్ష మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధ కళాకారులైన రాహుల్ శర్మ, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఉస్తాద్ రషీద్ ఖాన్, సుధా రఘునాథన్, శశాంక్ సుబ్రమణ్యం, కౌషికి చక్రవర్తి, సంజీవ్ అభ్యంకర్ తమ సంగీతంతో అలరించనున్నారు.

హార్ట్‌ఫుల్‌నెస్ శ్రీ రామ్ చంద్ర మిషన్  ఆది గురువు లాజీ మహారాజ్ 150వ జయంతి వేడుకల సందర్భంగా శంషాబాద్ సమీపంలోని కన్హా శాంతి వనంలో ఈ సంగీతోత్సవం నిర్వహించున్నారు. ఈ కార్యక్రమం వివరాలను  హర్ట్ ఫుల్నెస్ నిర్వాహకులు ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: