ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది. ఇక అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే ప్రపంచాన్ని మొత్తం బంధించి తనకు ఏం కావాలో అది చూసేస్తూ ఉన్నాడు ప్రతి మనిషి. ఇక టెక్నాలజీకి అనుగుణంగానే మనిషి జీవనశైలిలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో కూడా కొంతమంది మాత్రం ఇంకా మూఢకు నమ్మకాల ఊబిలో కూరుకుపోతూ టెక్నాలజీకి దూరంగానే బ్రతుకుతూ ఉన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అన్న విషయాన్ని నమ్ముతూ ఇంకా ఎన్నో దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే క్షుద్ర పూజల పేరుతో ఇటీవల కాలంలో ఎంతోమంది ఏకంగా హత్యలకు సైతం పాల్పడుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. బురిడీ బాబాలు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్ముతున్న ఎంతోమంది చివరికి ఏకంగా సొంత వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా వెలుగులోకి వచ్చింది. ఒక తల్లి ఏకంగా కొడుకును కాపాడుకోవడం కోసం కూతురి ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధమైంది. మూఢనమ్మకాల మాయలో మునిగిపోయి ఏకంగా పేగు తెంచుకొని పుట్టిన కన్న కూతురిని దారుణంగా చంపేసింది.


 గగుర్పాటుకు గురి చేసే ఈ ఘటన రాజస్థాన్ లోని భారాన్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు బాగుండాలని మూఢనమ్మకంతో కూతురిని చంపేసింది. రేఖ అనే మహిళకు 16 ఏళ్ల కొడుకు నికేంద్రసింగ్ ఉన్నాడు. అతనికి గుండెలో రంద్రం ఉంది. మానసిక స్థితి కూడా సరిగా ఉండేది కాదు. దీంతో ఇటీవలే ఒక మంత్ర గాడిని ఆశ్రయించగా ఎవరినైనా బలి ఇస్తే కొడుకు ఆరోగ్యం మెరుగుపడుతుందని ఉచిత సలహా ఇచ్చాడు. ఇక దీనిని గుడ్డిగా నమ్మిన రేఖ ఏకంగా కడుపున పుట్టిన కూతురునే దారుణంగా గొంతు కోసి చంపింది. ఇక ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితురాలని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: