ప్రస్తుతం దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది . ఏం కావాలన్నా అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే దొరికేస్తుంది. దీంతో టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న మనిషి ఇక జీవన శైలి లో ఎన్నో మార్పులు తెచ్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాదు ఇక టెక్నాలజీ అనుగుణం గానే ముందుకు నడుస్తూ ఒకప్పటి అంద విశ్వాసాలను పూర్తిగా గాలికి వదిలేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే నేటి ఆధునిక సమాజం లో కూడా కొంత మంది ఇంకా అనాగరిక జీవితాన్ని గడుపుతున్నారు అన్నది వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనల ద్వారా అర్థమవుతుంది.


 టెక్నాలజీతో ఏదైనా సాధించవచ్చు అని ఎంతోమంది నిరూపిస్తున్న నేటి రోజుల్లో కూడా మంత్రాలకు చింతకాయలు రాలుతాయని కొంతమంది గుడ్డి నమ్మకాలతోనే జీవనం సాగిస్తున్నారు. ఏకంగా మంత్రాల నేపంతో నర బలులు ఇస్తున్న దారుణమైన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఎక్కడో  జరగలేదు.. టెక్నాలజీకి, అభివృద్ధికి మారుపేరైన నగరంగా కొనసాగుతున్న హైదరాబాద్ నగరంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.



 ఒక మహిళ మంత్రాల నేపంతో ఏకంగా 8 ఏళ్ల బాలుడిని నరబలి ఇచ్చింది. అమావాస్య రోజు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  అమావాస్య కావడంతో అబ్దుల్ వహీద్ అనే బాలుడిని అల్లాదున్ కోటి ఏరియాలో నరబలి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే బాలుడు మృతదేహం సమీపంలోని ఓ నాలాలో లభించింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ మహిళ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ దారుణమైన ఘటనతో స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: