ఈ మధ్య వివాహేతర సంబంధం అనే మాట ఎక్కువగా వినిపిస్తున్నాయి. వావి వరుసలు మరచి చేస్తున్న ఈ సంబంధాలు ఎన్నో అనర్థాలకు దారి తీస్తున్నాయి. ఒకవైపు కుటుంబాలు చెల్లా చెదురు అవుతున్నా, మరోవైపు ప్రాణాలు పోతున్నా కూడా అటువంటి బందాలను మాత్రం వదిలి పెట్టలేదు..ఒకవైపు భర్తలు ఉన్నా కూడా మరో వైపు ఇలాంటి కనెక్షన్స్ ను ఎక్కువగా పెట్టుకోవడం సిగ్గుచేటు. కలికాలం అని వదిలేయడం తప్ప..


పోనీ ఉంది అది ఒకరితో కాదు.. ఇద్దరితో.. ఆ విషయం భర్తకు తెలిసింది. దాంతో కోపం తో ఊగిపోయిన భర్త ఆమెను అతి దారుణంగా చంపాడు.. ఈ ఘటన కడప జిల్లా లో వెలుగు చూసింది. జిల్లా లోని మైదుకూరు లోని లక్ష్మీ , మాబు అనే వాళ్ళు చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఎంతకాలం ఇలా ఉంటాము పెళ్లి చేసుకుంటామని ఆమె అనడం తో అతను సరే అన్నాడు. కడప పెద్ద దర్గాలో వెళ్లి పెళ్లి కూడా చేసుకున్నారు. కొంత కాలం బాగానే ఉంది.


కొన్నాళ్లకు ఆదిలక్ష్మి ప్రవర్తన లో మార్పు వచ్చింది. ఆమె మాబును పెళ్లి చేసుకున్నప్పటికీ నాని అనే మరో వ్యక్తి తో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఒకవైపు భర్త తో పడక సుఖం, ప్రియుడి తో శృంగారం రెండు కొద్దీ రోజులు బాగానే జరిగాయి. ఈ విషయం బయటకు పొక్కింది. అలా ఆ నోటా.. ఈ నోటా పాకింది. ఈ విషయం లో పలుమార్లు ఆదిలక్ష్మిని మాబు హెచ్చరించాడు. అయినా ఆమె పట్టించుకోకపోవడంతో తనను మోసం చేసిన ఆదిలక్ష్మిని చంపాలని నిర్ణయించుకున్నాడు. వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆమెను  బావి దగ్గరకు రమ్మని పిలిచాడు. అనుకున్న విధంగా బండరాయి తో కొట్టి చంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి,అసలు విషయాన్నీ బయటపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: