అమ్మాయిలకు సమాజంలోనే కాదు.. ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయింది. అభంశుభం తెలియని అమాయక చిన్నారులపై లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. సొంతవారే కామాంధుల మరి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నేటి సమాజంలో ఇటీవల కాలంలో పరాయివాళ్ల నుంచే కాక మన అనకున్న సొంతవారి నుంచే ఆపదలు పొంచి ఉంటున్నాయి. ఇక వావి వరుసలు, మంచి మర్యాదలు మరిచి వారితో నీచంగా ప్రవర్తిస్తున్నారు.

అయితే తాజాగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలికకు అండగా నిలవాల్సిన అన్ననే చెల్లిపై లైంగిక దాడికి పాల్పడుతున్న అమానుష ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 15 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి జీవనం సాగిస్తుంది. అయితే ఆమె తండ్రి అనారోగ్యంతో 14 ఏళ్ల క్రితమే మృతి చెందింది. ఇక ఇటీవల కాలంలో ఆ బాలిక తల్లి కూడా మృతి చెందింది. తల్లిదండ్రులు కోల్పోయిన ఆ బాలికను ఆమె పెద్ద అన్నయ్య(26) మకార్బాలోని తన ఇంటికి తీసుకొచ్చాడు.

అయితే ఆ బాలికను చూసుకునేందుకు ఎవరు లేకపోడంతో ఆమె అతని ఇంటికి వెళ్ళింది. ఇక అదే సమయాన్ని అదునుగా భావించిన సోదరుడు సొంత చెల్లెలిపై మూడేళ్లుగా అఘాయిత్యానికి పాల్పుడుతూనే ఉన్నాడు. అయితే అతను అతడితో ఆగకుండా ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరింపులకు గురి చేశాడు. అయితే గత మూడు నెలలుగా బాలికకు నెలసరి రాకపోవడంతో అనుమానం వచ్చిన వదిన తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యునికి చూపించారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భం దాల్చినట్టుగా నిర్దారణ చేశారు.

ఇక బాలికను నిలదీయగా అసలు విషయం చెప్పింది. దీంతో బాధితురాలిని తీసుకోని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే 2019 జనవరి 29 నుంచి నుంచి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని, తను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా అతని భార్య పడుకున్న సమయంలో సోదరుడు అఘాయిత్యానికి పాల్పడేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోని దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: