మేకప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఎవరదీ నిజమైన అందం అనే విషయం కనిపెట్టడం కాస్త కష్టమే..అంతలా మాయ చేస్తుంది. అందుకే ఈ రోజుల్లో ఎవరూ అసలు, ఎవరూ నకిలీ అనే విషయం కనిపెట్టడం సాహాసమె..ఓ ఆంటీ వయ్యస్సు 50 ఏళ్ళు, అయితే మేకప్ తో మాయ చేసి 30 ఏళ్ళ యువతి లాగా మార్చింది.తమిళనాడు రాష్ట్రం, తిరువళ్ళూరు జిల్లా, పుదుప్పేటలో ఇంద్రాణి (65) కుమారుడుతో కలిసి నివాసం ఉంటోంది. ఇంద్రాణి కుమారుడు ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.


అయితే అప్పటికే అతగాడికి పెళ్లై విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలో గత 6 ఏళ్లుగా కొడుక్కి తగిన వధువు కోసం ఇంద్రాణి వెతుకుతోంది. 2021లో ఆమెకు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా, పుత్తూరు ప్రాంతానికి చెందిన శరణ్య అనే మహిళ ఓ పెళ్లి బ్రోకర్‌ ద్వారా పరిచయమైంది.తనను చూసుకోవడానికి వస్తున్నారన్న సమాచారం తెలియడంతో 54 ఏళ్ల శరణ్య వెంటనే బ్యూటీపార్లకు వెళ్లి మేకప్ వేయించుకోని యువతిలా తయారైంది. ఆతర్వాత 35 ఏళ్లతో వరుడి ఎదుట పెళ్లి చూపులకు కూర్చుంది. ఆమె అందానికి ఫిదా అయిన వరుడు కుటుంబీకులు వెంటనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత తిరువళ్లూరులో భారీగా ఖర్చు చేసి గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. అంతేకాదు పెళ్లికూతురికి 25 సవర్ల బంగారాన్ని ఎదురిచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు.


కొద్దిరోజుల తర్వాత శరణ్య భర్తకు, అత్తకు చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. భర్త సంపాదనంతా తనచేతిలోనే పెట్టాలని, బీరువా తాళాలు ఇవ్వాలంటూ గొడవపడుతుండేదు. అంతేకాదు భర్త, అత్త పేరుమీదున్న ఆస్తులను తనపేరు మీద రాయాలని డిమాండ్ చేస్తుండేది. ఈ క్రమంలో అత్త ఇంద్రాణిని ఇంటినుంచి వెళ్లగొట్టింది. ఐతే వేధింపులకు అడ్డుకట్టవేయాలని భావించిన భర్త.. ఆస్తి నీ పేరు మీద రాసేందుకు ఆధార్ కార్డ్ ఇవ్వాలని కోరాడు. దీంతో వెంటనే శరణ్య తన ఆధార్ కార్డును భర్తకు ఇచ్చింది. అందులే కేరాఫ్ రవి అని రాసి ఉండటంతో ఇంద్రాణికి, ఆమె కుమారుడికి డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు..పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చెస్తె అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.గతంలో కూడా ఆమె ఇలానే మొసాలకు దిగిందని విచారణ లో వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: