రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యా దాటికి ఉక్రెయిన్ నిలబడలేక పోతుందని సమాచారం. తాను ఎన్ని దేశాల సహాయం తీసుకుని ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆయుధాలను వాడుతున్నా కూడా రష్యా ముందు తేలిపోతుంది ఉక్రెయిన్. అసలు రష్యాకు ఎదురుపడి యుద్ధం చేయలేక పోతుంది. ఇందు కోసమే  బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాల సహాయం తీసుకుంటుంది ఉక్రెయిన్.


దీనికి సమ్మతి తెలిపిన బ్రిటన్ ఉక్రెయిన్ కు స్ట్రాంగ్ షాడో మిస్సైల్స్ ఇచ్చిందని సమాచారం. ఈ మిస్సైల్స్ స్పెషాలిటీ ఏమిటంటే ఇవి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ధ్వంసం చేయగలవట. అలాగే ఫ్రాన్స్ కూడా ఇలాంటి పవర్ ఫుల్ మిస్సైల్స్ ని ఇచ్చిందని తెలుస్తుంది. ఆ మిస్సైల్స్ పేరు స్కాల్ప్ మిస్సైల్స్ అని సమాచారం. ఈ స్కాల్ప్ మిస్సైల్స్ వీళ్లు పైకి 250 కిలోమీటర్లు చెబుతున్నా కూడా 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ధ్వంసం చేయగలవని  తెలుస్తుంది.


మొన్న రష్యాలో స్టాఫ్ కమాండర్ తో పాటు మిగిలిన కమాండర్ లందరూ ఉన్న ఒక హోటల్ ని స్ట్రాంగ్ షాడో మిస్సైల్ ద్వారా ధ్వంసం చేశారట. ఈ సంఘటనలో ఆ హోటల్ శిబిరాల కింద పడి వాళ్ళందరూ మరణించారని తెలుస్తుంది. కమాండర్లు చనిపోవడంతో రష్యా సైన్యానికి నాయకత్వ లోపం ఎదురైందని సమాచారం. ఇది ఈ మద్య  రష్యాపై ఉక్రెయిన్ సాధించిన గొప్ప విజయం అని చెప్పుకోవచ్చు.


ఎలాగూ శత్రు స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పడానికి తన మిత్ర దేశాలైన అమెరికా, యూరప్ దేశాలు, నాటో దేశాలు  ఉక్రెయిన్ కు మార్గ నిర్దేశకత్వం చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఉక్రెయిన్ చేయవలసిందల్లా వాళ్ళ సూచనలను జాగ్రత్తగా పాటించడమే. రష్యా ఇప్పుడు తన లోపలి ప్రాంతాలైన బెల్ గ్రేడ్, క్రిమియా అలాగే మాస్కో ప్రాంతాల లోకి స్కాల్ప్ మిసైల్స్ ఒక్కటి వచ్చినా కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఉక్రెయిన్ కి హెచ్చరికలు జారీ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: