శివరామ కృష్ణన్ కమిటీని రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం వేసింది. వారి పని ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో భౌగోళిక స్వరూపం, పర్యావరణం, ఆర్థిక పరిస్థితులు రీత్యా రాజధాని ఎక్కడ కరెక్ట్ అనేది చెప్పడం. వాస్తవంగా కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత రాజధాని ఎంపిక చేసుకుంటే బాగుండేది. కానీ చంద్రబాబు నాయుడు ఆ కమిటీ రిపోర్టు రాకముందే అమరావతిని నిర్ణయించారు. కోస్తా ప్రాంతాల్లో రాజధాని పెట్టకూడదని చెప్పారు.


ఒక వేళ కోస్తా, గుంటూరు జిల్లాలో పెడితే మాత్రం అక్కడి భూములు మొత్తం బీడు భూములుగా మారిపోతాయని కమిటీ రిపోర్టు ఇచ్చింది. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఎక్కువగా నిర్మాణాలు జరుగుతాయి. పంట పొలాలు ఉండవు అని తేల్చి చెప్పారు. ఎక్కువ మంది రాజధాని ఆకాంక్షిస్తుంది మాత్రం కృష్ణా, గుంటూరు వాళ్లే రావాలని కోరుతున్నారని మా కమిటీకి ఎక్కువ మెయిల్స్ వచ్చాయి.  


వీరు బ్రిటిష్ కాలంలో ఎక్కువగా ఈ ప్రాంతం నుంచి పాలన కొనసాగించారు. కాబట్టి ఇక్కడ కచ్చితంగా రాజధాని పెట్టాలని స్థానికుల నుంచి మెయిల్స్ వచ్చాయి. కానీ అక్కడ ఉండే పర్యావరణ పరిస్థితుల కారణంగా అమరావతి వద్దని కమిటీ రిపోర్టు ఇచ్చింది. ఒకవేళ కృష్ణా జిల్లాలోనే రాజధాని నిర్మించాల్సి వస్తే మెట్ట భూముల్లో పెట్టాలని లేకపోతే ప్రకాశం జిల్లా దోనకొండలో ఎక్కువగా ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రాంతంలో పెట్టాలని సూచించారు.


ఇదంతా పక్కనపెట్టి మూడు పంటలు పండే 29 గ్రామాల్లో రాజధాని పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అనంతరం సీఎం జగన్ మూడు రాజధానులు అని ముందుకెళ్లడం.. తర్వాత దాన్ని ఉపసంహరించుకోవడంపై సుప్రీంకోర్టులో కేసు ఉంది. దీనికి వైసీపీ రివర్స్ గేమ్ వేసింది. గుంటూరు ఎమ్మెల్యే మస్తాన్ శివరామకృష్ణన్ కమిటీని నివేదికను అమలు చేయాలని కోరారు. మరి దీనిపై శివ రామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేస్తే ఎలాంటి ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: