తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంపై ఏఐసీసీ దృష్టి పెట్టింది. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీ కోసం ఏకంగా ఓ భారీ కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా తెలంగాణ  పీసీసీ రాజకీయ, కార్యనిర్వాహక కమిటీలు, జిల్లాల కమిటీలను ఏఐసీసీ ప్రక్షాళన చేసింది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా ఏఐసీసీ నియామించింది. రాజకీయ వ్యవహారాల కమిటీ, కార్యనిర్వహక కమిటీలో పీపీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, వీచ్‌, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి.. ఇలా మొత్తం 18 మంది సభ్యులుగా ఉన్నారు.


ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు అజహరుద్దీన్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, జగ్గారెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్‌ ఉంటారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పీసీసీ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటు చేసిన ఏఐసీసీ... అందులో మల్లు భట్టివిక్రమార్క, వీహెచ్‌, రేణుకాచౌదరి, దామోదర్ సి రాజనరసింహ, పి.బలరాంనాయక్‌, నాగం జనార్థన్‌ తదితరులు మొత్తం 23 మందికి అవకాశం కల్పించింది. ఇక జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది.


అయితే.. తొలి విడతలో 26 జిల్లాలకే జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితాను ఏఐసీసీ వెల్లడించింది. ఆ జాబితా ఇలా ఉంది.. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడుగా సాజిద్ ఖాన్ నియమితులయ్యారు. పొడెం వీరయ్య - భద్రాద్రి కొత్తగూడెం, ఎన్.రాజేందర్‌రెడ్డి - హనుమకొండ, సమీర్ - హైదరాబాద్, ఎ.లక్ష్మణ్ కుమార్ - జగిత్యాల, పటేల్ ప్రభాకర్‌రెడ్డి - జోగులాంబ గద్వాల్, కైలాస్ శ్రీనివాస్ - కామారెడ్డి, సీ.రోహిన్‌రెడ్డి - ఖైరతాబాద్, జె.భరత్‌చంద్రారెడ్డి - మహబూబాబాద్, మధుసూదన్‌రెడ్డి - మహబూబ్‌నగర్, కె.సురేఖ - మంచిర్యాల, తిరుపతిరెడ్డి - మెదక్, నందికంటి శ్రీధర్ - మేడ్చల్ మల్కాజిగిరి.


కుమారస్వామి - నాగర్‌కర్నూలు, శంకర్ నాయక్ - నల్గొండ, శ్రీహరి ముదిరాజ్‌ - నారాయణపేట, ప్రభాకర్‌రెడ్డి - నిర్మల్, మానాల మోహన్‌రెడ్డి - నిజామాబాద్, ఎంఎస్ రాజ్‌ ఠాకూర్ - పెద్దపల్లి, ఆది శ్రీనివాస్ - రాజన్న సిరిసిల్ల, టి.నర్సారెడ్డి - సిద్ధిపేట, ఎం.రాజేందర్ ప్రసాద్ యాదవ్ - వనపర్తి, కె.అనిల్ కుమార్ - యాదాద్రి భువనగిరి. మరి ఇంత భారీ జట్టు రేవంత్‌కు ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: