
ఈ ప్రగతి దేశ భద్రతా చర్యల విజయాన్ని సూచిస్తోందని మోదీ హైలైట్ చేశారు. ఈ కామెంట్స్ చత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్ల తర్వాత వచ్చాయి.నక్సల్స్ అభివృద్ధి నిరోధకులుగా మారారని ప్రధాని మోదీ ఆరోపించారు. వారు రోడ్లు, సెల్ టవర్లు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణాన్ని అడ్డుకున్నారని తెలిపారు. ఈ కారణంగా మారుమూల ప్రాంతాలు వెనుకబడ్డాయని, ప్రజలు దారిద్ర్యంలో చిక్కుకున్నారని వివరించారు.
ఇప్పుడు ఆ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయని, రోడ్లు, విద్యా సదుపాయాలు, ఆరోగ్య సేవలు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ మార్పు వల్ల వేల మంది నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారని, ఇది ప్రభుత్వ విధానాల విజయమని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ చర్యలు దేశ ఐక్యతకు బలపడతాయని నొక్కి చెప్పారు.ఉగ్రవాదం, నక్సలిజానికి భారత్లో చోటు లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడమే మా లక్ష్యమని ప్రకటించారు. హిమాలయ పర్వత శిఖరాలు భారత్ మాతా కీ జై అంటున్నాయని, సముద్ర కెరటాలు కూడా భారత్కు జై కొట్టుకుంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలు దేశ జాతీయ భావనను రేకెత్తించాయి. ఆపరేషన్ కగార్లో భద్రతా బలగాలు చూపిన ధైర్యాన్ని మోదీ ప్రశంసించారు. ఈ ఆపరేషన్ మూలాల వద్ద నక్సలిజాన్ని అంతం చేయడానికి కీలకమని తెలిపారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు