ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డేవార్ కందకూరులో పుట్టిన చరిత్ర ఈ జిల్లాకు ఉందని కవిత గుర్తు చేశారు. మానాల అడవుల్లో ఎన్కౌంటర్లు జరిగిన నేపథ్యం కూడా ఉంది. ఆర్ఎస్యూ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అందరికీ మద్దతు ఇచ్చిన గడ్డ ఇదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి మొదటి జెడ్పీ ఛైర్మన్ నిజామాబాద్ నుంచే గెలిచారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ఉద్యమం ఊపందుకుందని వివరించారు. అన్ని భావజాలాలకు మద్దతు ఇస్తూ ముందున్న జిల్లా ఇదని ఆమె కొనియాడారు.
ఇరవై ఏళ్లుగా తెలంగాణ కోసం పనిచేశానని కవిత ఉద్వేగంగా చెప్పారు. ఇరవై ఏడేళ్ల వయసులో ఉద్యమంలోకి వచ్చానని గుర్తుచేశారు. మీ బిడ్డగా పార్లమెంటుకు పంపారని స్థానికులకు ధన్యవాదాలు తెలిపారు. మీ మర్యాద గౌరవం కాపాడేలా పనిచేశానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని దీవించి అన్ని సీట్లు గెలిపించారని ప్రశంసించారు. ఎన్ని కష్టాలు వచ్చినా సహనంతో ఎదుర్కొన్నానని వెల్లడించారు.
ఇంటి గుట్టు బయటపెట్టి నన్ను ఇబ్బంది పెట్టారని కవిత ఆరోపించారు. కుట్ర చేసి పార్టీ నుంచి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఏమీ చేయనని స్పష్టం చేశారు. ఐదు నెలలుగా రాజకీయ పరిణామాల వల్ల నిజామాబాద్ రాలేకపోయానని వివరించారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి