విజయనగరం జిల్లాలో తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. సోమవారం రాత్రి తొమ్మిది గంటల వరకు ఇరవై మూడు పాయింట్ ఒక మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కొత్తవలసలో అత్యధికంగా యాభై ఆరు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వాన కురిసింది. తాటిపూడి ఆండ్ర మడ్డువలస జలాశయాలు నిండుకుండలుగా మారాయి. ఈ రోజు రేపు అతి భారీ వర్షాలు రావచ్చన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. డెబ్బై తొమ్మిది ముంపు ప్రాంతాలు గుర్తించారు. డెబ్బై ఒకటి పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. సోమవారం రాత్రి తొమ్మిది గంటల వరకు పదమూడు పాయింట్ మూడు మిల్లీమీటర్ల సగటు వర్షపాతం రికార్డైంది. కొమరాడ మండలంలో అత్యధికంగా అరవై పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వాన నమోదయింది. తోటపల్లి వెంగలరాయసాగర్ పెద్దగడ్డ ఒట్టిగడ్డ జలాశయాలు పూర్తి స్థాయికి చేరాయి. ముందస్తు జాగ్రత్తగా ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఈ రోజు రేపు భారీ వర్షాలు రానున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పాచిపెంట గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గర్భిణీ స్త్రీలను సీతంపేట గర్భిణీల వసతి గృహానికి చేర్చారు. ప్రజలు హెచ్చరికలు పాటించి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి