ఈ వారంలోనే పసిడి ధరలు భారీగా తగ్గాయి. తాజాగా పెరుగుదలను నమోదు చేశాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ హై రూ.57వేల నుండి బుధవారం నాటికి రూ.51వేలకు పడిపోయింది. అంటే దాదాపు పది శాతం పడిపోయింది. వెండి 22 శాతం క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 4 శాతానికి పైగా తగ్గింది. తాజా పెరుగుదలతో మన దేశంలోను దాదాపు అంతే తగ్గింది. బంగారం ధరలు గత సెషన్ ముగింపు సమయానికి ఎంసీఎక్స్‌లో 4 శాతం ఎగిశాయి. గత వారం బంగారం రూ.54,680కు చేరుకొని గరిష్టాన్ని అందుకుంది. బంగారం ఈ మూడు రోజుల్లో రూ.3,350 వరకు తగ్గింది. ఎంసీఎక్స్‌లో రూ.54,440 వద్ద మద్దతు ధర ఉండగా, రూ.55,000 దాటితే మాత్రం ఆ తర్వాత రూ.55,330 నుండి రూ.55,550 వరకు పెరగవచ్చునని బులియన్ మార్కట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఇన్వెస్టర్లు మాత్రమే బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. అయితే రిటైల్ మార్కెట్లలో మాత్రం బయట బంగారానికి డిమాండ్ బాగా పడిపోయింది. ప్రస్తుతం ధరలను చూసి వెనుకంజ వేసే పరిస్థితి. దీంతో రిటైల్ మార్కెట్ లేకుండా పోయింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.260 వరకు పెరిగి రూ.55,760 కు చేరుకుంది. నిన్నటి వరకు రూ.54,600కు పైన ఉంది. 22 క్యారెట్ల పసిడి రూ.60కు పైగా పెరిగి రూ.51 వేలకు పైకి చేరుకుంది. కిలో వెండి రూ.2,000 పెరిగి రూ.67,000కు చేరుకుంది.


గత కొద్ది నెలలుగా బంగారాన్ని ముందుకు నడిపించిన కారకాలు ఇప్పుడు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో సమీప భవిష్యత్తులో గోల్డ్ టార్గెట్ ఔన్స్ 2,100గా ఉందని చెబుతున్నారు. డిసెంబర్ నాటికి 2,350 డాలర్లకు పెరిగినా కొట్టి పారేయలేమని అంటున్నారు.ఆ రకంగా చూస్తే దీపావళి నాటికి 10 గ్రాముల పసిడి రూ.65వేలు, కిలో వెండి రూ.90వేలకు చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ ఏడాదిలో బంగారం టార్గెట్ ఔన్స్ 2,280 లేదా రూ.62,000గా ఉంటుందని, వెండి రూ.75 వేలకు చేరుకుంటుందని కొందరు నిపుణులు ఇదివరకే అంచనా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: