ఈ వేసవి కాలంలో సూర్యుని వేడికి అందరూ కూడా ఎంతగానో అల్లాడిపోతున్నారు. ఈ మండుతున్న ఎండల కారణంగా ఇళ్లలో నుంచి ఎవరూ కూడా బయటకు రావడం లేదు.కేవలం అత్యవసరం అయితే తప్ప ఎవ్వరు బయటకి రావడం లేదు. వాళ్ళ ఇళ్లకే పరిమితం అవుతున్నారు.ఈ క్రమంలోనే మండే ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు చాలా రకాల మార్గాలను అనుసరిస్తున్నారు. అందుకే చల్లని పానీయాలను చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు.అయితే శరీరాన్ని చల్లగా ఉంచే పానీయాలు చాలా ఉన్నప్పటికీ వాటిల్లో లస్సీ చాలా ముఖ్యమైంది. పెరుగుతో తయారు చేసే ఈ లస్సీని తాగితే శరీరం మొత్తం కూడా సింపుల్ గా చల్లబడుతుంది.ఒంట్లో వేడి ఈజీగా తగ్గుతుంది.ఈ క్రమంలోనే ద్రాక్షలతో చల్ల చల్లని లస్సీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ద్రాక్ష లస్సీ తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..పెరుగు – అర లీటర్‌ ఇంకా ద్రాక్ష పండ్లు (విత్తనాలు తీసినవి) – పావు కిలో అలాగే చక్కెర – పావు కప్పు ఇంకా ఉప్పు – చిటికెడు తీసుకోవాలి.


ద్రాక్ష లస్సీని తయారు చేసే విధానం విషయానికి వస్తే..ముందుగా పెరుగు, ద్రాక్ష పండ్లు, చక్కెర, ఉప్పు అన్నింటినీ తీసుకొని వాటిని మిక్సీ జార్‌లో వేసుకుని బ్లెండ్‌ చేయాలి. ఇక దీన్ని తయారు చేసిన తరువాత ఫ్రిజ్‌లో అస్సలు నిల్వ ఉంచరాదు. వెంటనే దీన్ని తాగేయాలి.అయితే ఇది చల్లగా ఉండేందుకు అందులో కాస్త చల్లని నీరు ని కలుపుకుని మీరు తాగవచ్చు. లేదా ఐస్‌ క్యూబ్స్‌ వేసుకుని కూడా మీరు తాగవచ్చు. అయితే దీన్ని మధ్యాహ్నం సమయంలో తాగాలి. దీంతో ఎండ వేడి నుంచి మీకు చాలా ఈజీగా ఉపశమనం లభిస్తుంది.ఇంకా శరీరం చల్లగా మారుతుంది.ఒంట్లో వేడి తగ్గుతుంది. ముఖ్యంగా పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తాగుతారు.కాబట్టి ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఖచ్చితంగా ఈ పానీయం తాగండి. ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: