గాయాలైనప్పుడు రక్తం నిలువకుండా కారుతుంటే,ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయం పైన పిండితే రక్తం కారడం నిలిచిపోతుంది.
శరీరంపై దురద,పొక్కులు, పొట్టు రాలుతుంటే శరీరంపై ఉత్తరేణి ఆకుల రసాన్ని పోయడం వల్ల, ఆ వ్యాధులన్నీ తగ్గుతాయి.
ఉత్తరేణి గింజల పొడిని,ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం అన్నింటినీ కలిపి ముద్దగా నూరి ఆ పేస్టును పంటిపై పెట్టుకోవడం వల్ల పంటి నొప్పి తగ్గడమే కాకుండా చిగుళ్ల నుండి రక్తం కారడం ఆగిపోతుంది.
గజ్జి, తామర వంటివి బాధిస్తుంటాయి. ఇలాంటి వాటికి ఉత్తరేణి ఆకులను కాల్చి బూడిద చేసుకోవాలి. ఆ బూడిదను ఆముదము తో కలిపి గజ్జి, తామర ఉన్నచోట లేపనంగా చేయాలి. ఇలా చేయడం వల్ల అవి తగ్గి పోతాయి. అలాగే బూడిద, తేనె కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుతాయి.
నువ్వుల నూనెలో ఉత్తరేణి ఆకుల రసాన్ని వేసి బాగా మరగనివ్వాలి.ఆ నూనెను పొట్టపై మర్దన చేయాలి. ఇలా చేయడం వల్లపొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతుంది.
కందిరీగలు,తేనెటీగలు,తేలు కుట్టినప్పుడు ఉత్తరేణి ఆకు ల్ని మెత్తగా నూరి కుట్టిన చోట పెట్టడం వల్ల నొప్పి, దురద తగ్గుతాయి.
ఉత్తరేణి ఆకుల రసాన్ని మజ్జిగతో కలిపి తీసుకోవడం వల్ల విరేచనాలు ఆగిపోతాయి. అలాగే ఉత్తరేణి ఆకు రసం, తేనె కలిపి తీసుకోవడం వల్ల పురుషుల్లో వచ్చే పౌరుష గ్రంధి వాపు తగ్గుతుంది.