ఇక శ్రమతో కూడిన వ్యాయామాలు చేసినప్పుడు.. అధిక ఒత్తిడి, జ్వరం, పోషకాల లోపం కారణంగా శరీరానికి నొప్పులు చుట్టుకుంటాయి. ఇక కొంతమంది బాడీపెయిన్స్ రాగానే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ రిలీఫ్ పొందుతూ ఉంటారు. కానీ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ వాము ఆకుతో తయారుచేసిన డ్రింక్ తాగితే ఎలాంటి శారీరక నొప్పులు అయినా సరే దూరం అవుతాయి.. ఇకపోతే ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం..
ముందుగా ఒక కప్పు వాము ఆకులను తీసుకొని శుభ్రంగా నీటిలో కడగాలి.. ఇప్పుడు ఒక గుడ్డ పైన వాటిని పరిచి తడి లేకుండా చేసుకోవాలి.. ఒక చెంచా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఈ ఆకులను రెండింటిని మిక్సీలో వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. ఇక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వడకట్టి అందులో కొద్దిగా తేనె , నిమ్మరసం కలుపుకొని తాగాలి. ఇలా తయారు చేసుకున్న వామాకుల రసం తాగుతూ ఉంటే శారీరక నొప్పులు దూరం అవ్వడంతో పాటు దగ్గు కూడా దూరం అవుతుంది. ఇక మూత్రపిండాల్లో రాళ్లు , జలుబు , ఇన్ఫెక్షన్లు కూడా దరి చేరవు. విరివిగా పెరిగే ఈ మొక్కను మీ ఇంటి పెరట్లో పెంచుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.