వడ దెబ్బ తగలకుండా ఉండాలంటే ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న మాంసాహారానికి ఖచ్చితంగా చాలా దూరంగా ఉండాలి. ఉప్పు, కారం ఇంకా అలాగే నూనెతో చేసిన ఆహారాన్ని నివారించండి. సూర్యుడు అత్యంత వేడిగా ఉన్నప్పుడు అంటే ఎండలు బాగా ఉండి ఇల్లు వేడిగా వున్నప్పుడు వంట చేయడం ఖచ్చితంగా మానేయాలి.అలాగే సులభంగా జీర్ణమయ్యే భోజనాన్ని చేయడం ఇంకా అంతేగాక కొంచెం కొంచెం తినడం ఖచ్చితంగా అలవర్చుకోవాలి. పీక్ హీట్ గంటలలో పని చేయడం ఇంకా వ్యాయామం చేయడం ఖచ్చితంగా మానుకోవాలి.పెరుగుతున్న ఎండల కారణంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లడాన్ని నివారించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.ముఖ్యంగా మన పిల్లలను పార్క్ చేసిన కార్లలో వదిలివేయకూడదని కూడా సిఫార్సు చేసింది. ఇంకా, ఆల్కహాల్, టీ, కాఫీ ఇంకా కార్బోనేటేడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండాలని కేంద్రం సూచించింది. అలాగే మధ్యాహ్నం కాకుండా సూర్యరశ్మి తగ్గిన తర్వాత బయటకు వెళ్లడం, ఉదయం ఇంకా సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు పోవడం మంచిదని పేర్కొంది.


అలాగే కూలీలు ఉదయం పూటనే పనులు పూర్తిచేసుకొని మధ్యాహ్నంలోగా ఇంటికి చేరేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే మధ్యాహ్నం పూట ఖచ్చితంగా బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకెళ్లాలంటున్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇంకా అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలన్నారు. అలాగే మీరు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ ఇంకా కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలి. ఇంకా పండ్ల రసాలు.. పుచ్చకాయ, దోసకాయ, నిమ్మకాయ అలాగే నారింజ వంటి తాజా పండ్లను ఖచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రోజులో వీలైనన్ని సార్లు మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: