చాలా మంది కూడా దగ్గు, జలుబు, జ్వరం వంటి ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. వర్షాకాలంలో అయితే ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.పిల్లల నుండి పెద్దల దాకా అందరూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. చాలా మంది ఈ సమస్యల నుండి బయటపడడానికి యాంటీ బయాటిక్స్ ను ఇంకా మందులను వాడుతూ ఉంటారు. అయితే వీటిని బదులుగా ఒక చిన్న ఇంటి చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మన ఇంట్లో ఉండే మిరియాలను, తేనెను కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యల నుండి ఈజీగా తక్షణ ఉపశమనం కలుగుతుంది.ఇంకా అలాగే తేనెను, మిరియాల పొడిని తీసుకోవడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.తేనె, మిరియాలు ఇవి రెండు కూడా మన ఇంట్లో ఉండేవే. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారు వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలి ఇంకా అలాగే వీటిని కలిపి తీసుకోవడం వల్ల మనకు కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు అర టీ స్పూన్ మిరియాల పొడిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇంకా గొంతులో పేరుకుపోయిన శ్లేష్మం కరిగిపోతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి చాలా ఈజీగా ఉపశమనం కలుగుతుంది. ఇంకా అలాగే మిరియాల పొడిని, తేనెను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.అలాగే అనారోగ్య సమస్యల బారిన, ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ఇంకా అలాగే మిరియాల పొడిని, తేనెను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.గ్యాస్, కడుపు ఉబ్బరం ఇంకా అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకా అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా తేనె  మిరియాల పొడి మనకు దోహదపడుతుంది. ఇంకా అలాగే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడే వారు తేనె, మిరియాల పొడిని కలిపి తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: