ఇది నేరేడు పండ్ల సీజన్. నేరేడు పండు అంటేనే ఒక ఔషధ గుణాల తోట, పచ్చగా ఉన్నప్పుడు పుల్లగా ఉండే ఈ పండు, పూర్తిగా పక్చినపుడు నలుపుగా మారుతుంది. సాధారణంగా వేసవిలో, జూన్-జూలై నెలల్లో ఈ పండు సీజన్ లోకి వస్తుంది. నేరేడు పండు మధుమేహం ఉన్నవాళ్లకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో జాంబోలిన్ అనే పదార్థం గ్లూకోజ్ శోషణాన్ని నియంత్రిస్తుంది. నేరేడు గింజల పొడి కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగులలో టాక్సిన్లు నిలవకుండా, అవి బయటికి వెళ్లేలా చేస్తుంది.

నేరేడు పండ్లలో విటమిన్ C, ఐరన్, మరియు పలు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉండేలా సహజసిద్ధంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయపడతాయి. వైరల్స్, బ్యాక్టీరియాల నుండి రక్షణ కోసం ఈ పండు మంచి సహాయకారి. పంటకాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరాలను నివారించేందుకు ఇది సహాయపడుతుంది. నేరేడు పండులో ఉండే విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడతాయి. నేరేడు పండులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి, హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.

ఇందులో ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రణలో, గుండె ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. పురుషులలో స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు సహాయపడతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. మధుమేహం ఉన్నవారు తినే పండ్ల పరిమాణాన్ని నియంత్రించాలి. ఎక్కువగా తింటే కడుపునొప్పి, గ్యాస్, పొట్టపొంగడం వంటి సమస్యలు రావచ్చు. గర్భిణీ స్త్రీలు డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. తాజా నేరేడు పండ్ల రూపంల, నేరేడు గింజల పొడి, నేరేడు రసం. చట్నీ లేదా జామ్ రూపంలో. ఆయుర్వేద మందులలో భాగంగా. నేరేడు పండ్లను శుభ్రంగా కడిగి, కొంచెం ఉప్పు చల్లుకుని తింటే రుచిగా ఉంటుంది. మితంగా తింటే, ఔషధంలా పనిచేస్తుంది. ఎక్కువగా తింటే అపాయకరం కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: