జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాక విశాఖలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు నానా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు అమరావతికి మద్ధతుగా నిలబడటంతో విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలకు కష్టాలు మొదలయ్యాయి. అలాగే విశాఖ కార్పొరేషన్ గెలవాలని చూస్తున్న వైసీపీ, నగరంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలని పార్టీలోకి లాగడమో, లేక వీక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.