నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం...వైసీపీకి కంచుకోట. గత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ వైసీపీదే గెలుపు. ఇక 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వరప్రసాద రావు దాదాపు 45 వేల మెజారిటీతో గెలిచారు. అయితే కేవలం జగన్ ఇమేజ్ వల్లే గూడూరులో వైసీపీకి ఇంత భారీ మెజారిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ మెజారిటీ వల్లే తిరుపతి పార్లమెంట్లో వైసీపీకి మరింత భారీ మెజారిటీ రావడానికి కారణమైంది.