గుంటూరు జిల్లా రాజకీయాల్లో కమ్మ సామాజివర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. జిల్లాలో సగం నియోజకవర్గాల్లో కమ్మ నేతల హవానే ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కమ్మ వర్గం ఆధిపత్యం ఎక్కువ. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీలోని కమ్మ నేతలకు చెక్ పెట్టడానికి 2019 ఎన్నికల్లో జగన్ వైసీపీలో కమ్మ నేతలని నిలబెట్టారు.