తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నాయకుల్లో అధికార వైసీపీలో ఎక్కువగానే ఉన్నారు. తక్కువ సమయంలోనే ప్రజల్లోకి చొచ్చుకుపోయి, ప్రజల కోసం కష్టపడుతున్న ఎమ్మెల్యేల్లో ఉషశ్రీచరణ్ కూడా ఒకరు. మొదట్లో తెలుగుదేశంలో రాజకీయం చేసిన ఆమె ఆ తర్వాత టీడీపీని వదిలి పెట్టి, వైసీపీ లోకి వచ్చి 2019లో కళ్యాణదుర్గం సీటు దక్కించుకున్నారు. కళ్యాణదుర్గం టీడీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఇక్కడ ఎక్కువ సార్లు ఆ పార్టీ జెండా ఎగిరింది.