అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది రెండేళ్లలో మంచి పనితీరు కనబర్చారు? ఎంతమంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? ఎంతమందికి తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలిచే సత్తా ఉంది? అంటే వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకిత వస్తున్నట్లు కనిపిస్తోంది. అలా వ్యతిరేకిత వస్తున్న వారిలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ముందు వరుసలో ఉన్నారని విశ్లేషణలు వస్తున్నాయి.