ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి....వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేయడంతో, పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత నిదానంగా బయటపడుతుంది. గత ఎన్నికల్లో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో వెనుకబడి, ప్రజల నుంచి వ్యతిరేకత కొనితెచ్చుకుంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే కాదు..కొందరు టీడీపీ ఎమ్మెల్యేలపై కూడా వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. అలా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురుకుంటున్న వారిలో పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా ఉన్నట్లు తెలుస్తోంది.