ప్రకాశం జిల్లాలో ప్రతిపక్ష టీడీపీకి కాస్త అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో కొండపి కూడా ఒకటి. టీడీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ...పసుపు జెండా ఎక్కువసార్లు ఎగిరింది. ఇది 2009లో ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గంగా మారినా సరే ఇక్కడ టీడీపీ బలం తగ్గలేదు. 2009లో టీడీపీ తరుపున డోలా బాల వీరంజనేయ స్వామి పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఇక 2014 ఎన్నికల్లో మంచి మెజారిటీతో డోలా ఎమ్మెల్యేగా గెలిచారు.